Sunday, June 6, 2010

సహృదయతకు సలాం!


సినిమా అభిమానులందరి దృష్టీ ఇప్పుడు ఒకే విషయమ్మీద వుంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూసే ఫాన్స్... హీరోలంతా కలసి ఆడే స్టార్ క్రికెట్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ మ్యాచ్ కర్టెన్ రైజర్ నిన్న ఘనంగా జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ తమ టీం లతో సందడి సందడి చేసారు. ఎందుకో ఆ కార్యక్రమం చూసినపుడు నాకు చాల ఆనందం కలిగింది. షూటింగులు, అవుట్ డోర్లు, రిలీజులు, బాక్సాఫీసులు, ఫ్యాన్సు అంటూ హడావుడిగా తిరిగే నటీనటులంతా ఒక మంచిపని కోసంరావటం నిజంగా అభినందనీయం. ఏసీ గదుల్లో ఉంటూ, బెంజి కార్లలో హ్యాపీగా తిరగటమే కాదు, అవసరమైతే జనంలోకి వచ్చి, స్టార్ డం లు పక్కన పెట్టి, పదిమందికి ఉపయోగపడే పనులు చేయగలం అని మన హీరోలంతా చాటుతున్న తరుణమిది. ఇంతకుముందు కూడా ఇలాంటి మ్యాచ్ లు జరిగాయి. అయితే ఈసారి మ్యాచ్ ను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ కు, రాజకీయాల్లో బిజీగా వున్నా ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకోటానికి సిద్ధపడిన చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. అలాగే తమ తమ బిజీ షెడ్యూల్స్ ని పక్కన పెట్టి, గ్రేట్ స్పిరిట్ తో ఆడటానికి సిద్దపడుతున్న మన స్టార్స్ సహృదయతకు కూడా సలాం చేసి తీరాలి.
జూన్ పదమూడున జరగనున్న స్టార్ క్రికెట్ మ్యాచ్ కి హాజరవటం ద్వారా ఈ మహత్తర కార్యంలో మనం కూడా పాలు పంచుకుందాం.

No comments:

Post a Comment